తుమ్మలపాలెం గ్రామానికి నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలి – పోలిశెట్టి తేజ

ఇబ్రహీంపట్నం, మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పోలిశెట్టి తేజ తుమ్మలపాలెం గ్రామ సమస్యలను మరొకసారి మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు..గ్రామంలో వాడుకలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలికంగా వాటికి మరమ్మత్తులు చేయించి, మరొకచోట నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చెయ్యాలని, అంతే కాకుండా సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్న తుమ్మలపాలెం విద్యార్థులకు గ్రామంలో ఉన్న రెండు బస్ స్టాప్ ల్లోను ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోని ఉన్న సిటీ బస్సులను అపవలసినదిగా ఆర్టీసీ అధికారులను కోరారు.