జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

జె.ఎస్.పి గ్లోబల్ టీం ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా శనివారం జనసేన జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఈ “జె.ఎస్.పి గ్లోబల్ టీం” ఏర్పడడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 15 నుండి 18 దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు సుమారు 70 నుండి 100 మంది పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ… జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో ఏ విధంగా బలంగా తీసుకెళ్ళాలి… దానికి ఎన్నారై జనసేన నాయకుల సహకారం ఏ విధంగా అందించాలి అనే అంశాలపై తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించడం జరిగింది. పలు దేశాల నుండి పాల్గొన్న జనసేన నాయకులు తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకోవడం జరిగింది. అన్ని దేశాల జనసేన నాయకులతో కో ఆర్డినేట్ చేసుకుని ఈ సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు ప్రశంసించడం జరిగింది.