జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సర్వసభ్య సమావేశం

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ మరియు నియోజకవర్గాల ఇంచార్జులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.