జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

నెల్లూరు, మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబులు పిలుపునిచ్చారు. మంగళవారం పూలే వర్ధంతిని పురస్కరించుకొని వారు జన సైనికులతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకు విద్య ఎంతో అవసరం అని భావించిన పూలే ఆ దిశగా మహిళా విద్యకు పాటుపడ్డారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే దంపతులు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటం మరువలేనిదన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన గొప్ప మహనీయుడని. ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం, నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్వర్ బాష, నగర ప్రధాన కార్యదర్శి కరీం, నగర డివిజన్ ఇంచార్జ్ లు పవన్ యాదవ్, శ్రీకాంత్, కిషోర్, ఉదయ్, దినేష్, ప్రవీణ్ సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.