కేబీసీ చర్చి వార్షికోత్సవంలో పాల్గొన్న జ్యోతుల

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన కేబీసీ చర్చి10వ వార్షికోత్సవాల్లో పిఠాపురం జనసేననాయకులు జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జ్యోతుల శ్రీనివాసు 10వ వార్షికోత్సవ కేకును కట్ చేసారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యాతిథి జ్యోతుల శ్రీనివాసు ప్రసంగిస్తూ సాంఘికులంతా కూడా ఉపవాసదినాలను భక్తిశ్రద్ధలతో చేపట్టడం ఎంతో ఆనందదాయమని, ఉపవాస దినాల్లో దేవునియందు మనస్సును లగ్నం చేసి, సంఘ కాపరులు చెప్పే హితబోధను విని సమాజశ్రేయస్సు కోసం అందరూ కష్టపడాలని, సమాజ శ్రేయస్సు కోసం అందరూ కష్టపడినట్టుయితే రాబోయే రోజుల్లో మంచిసమాజాన్ని స్దాపొంచిన అవుతామని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ సభ యందు సంఘకాపరి పి ఎన్ రావు మరియు సంఘ అధ్యక్షులు అందరూ కలిసి జ్యోతుల శ్రీనివాసుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘకాపరి అయిన పి ఎన్ రావు, దుర్గాడ గ్రామానికి చెందిన మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల గోపి మేడిబోయిన శ్రీను, మొగిలి శ్రీను, కాపారపు మల్లయ్య, ముర్రే బాబులు, ఉబా బాలరాజు, శివకోటి చందర్రావు, దండల రాంబాబు, శివకోటి జాన్, గుల్లా నాగేంద్ర, దండల సత్తిబాబు, ముర్రే మరిడియ్య, దెయ్యాల అప్పారావు, కోనాల దావీద్, శివకోటి జీవనరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.