రామగుండం జనసేనలో భారీ చేరికలు

తెలంగాణ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఆయన చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ సమక్షంలో పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామానికి చెందిన మహిళలు యువకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసేల వారు కృషి చేయాలన్నారు, 1400 మంది బలిదానాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు కేవలం ఒక కుటుంబం చేతిలో బందీగా ఉందని వారు తెలియజేశారు దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అంటూ మోసపూరితపైన హామీలు ఇచ్చి కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఆ పథకాలు వచ్చాయి అన్నారు. రానున్న రోజుల్లో రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన జనసేన పార్టీ కచ్చితంగా పోరాడుతుందని తెలియజేశారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో జనసేన పార్టీని రామగుండం నియోజకవర్గంలో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల అధ్యక్షుడు బూసా శ్రీనివాస్ వీర మహిళా విభాగం నాయకురాలు కానిగంటి మంగ, రమాటెంకి స్వారూప, కమరా మానస, రామారావు పల్లి గ్రామ నాయకులు బండి సాగర్, పొన్నవెని హరీష్, మేకల శ్రీకాంత్, మధరవేని తిరుపతి, పొన్నవేని మహేష్, కొండ సాజన్, మదారవేని సురేష్, మేకల మహేష్, నిమ్మరజుల మహేష్, పోలు ప్రణీత్, నడెం సాయి, అజయ్, రాకేష్, కేశవ్, శ్రావణ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.