కృష్ణా జిల్లా అధ్యక్షులను కలిసి నియోజకవర్గ సమస్యలని వివరించిన కైకలూరు జనసేన నాయకులు

జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ కలిసి నియోజకవర్గ సమస్యలని వివరించిన మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం వల్ల మిణువు చేల రైతులను ఆదుకోవాలని. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి నష్టపరిహారం చెల్లంచే విధంగా చూడాలని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు(వెంకయ్య) స్థానిక జనసేన నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణకి తెలిపారు. అనంతరం ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి, 2024 కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారం వచ్చేలా పార్టీని ముందుకు తీసుకువెళ్తాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, ఉరిమి సర్పంచ్ పంచకర్ల సురేష్, మండల నాయకులు అంబుల భరత్, కటారి పవన్, బోయిన శ్రీనివాస్, మారుబోయిన సాయి, సుదాబత్తుల సాయీష్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.