కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఐటీ సమావేశం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక బలిజ కళ్యాణ మండపంలో కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఐటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అస్త్ర యాప్ ఏ విధంగా ఉపయోగించాలో జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరించడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు, స్థానిక నాయకుల కార్యక్రమాల గురించి ఈ యాప్ లో సమాచారం ముందుగానే తెలుస్తుంది. సోషల్ మీడియాలో జనసైనికులు మరింత యాక్టివ్ గా ఉండడానికి అస్త్ర యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క జనసేన నాయకులకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని అవకాశం ఉంటుంది. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ఎన్నో అడ్డంకులు సృష్టించి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ షేక్ తార, జనసేన నాయకులు జయకృష్ణ, కాంతరాజ్, ఆంజనేయులు, రామలింగ, వంశీ, జాకీర్, ముక్కన్న, నాగరాజు, సురేష్, చిత్తప్పా, మహేష్, ఐటీ టీం సభ్యులు రాంప్రసాద్ శ్రీనివాసులు మొదలైన జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.