వెంకటరమణని పరామర్శించిన కందుల దుర్గేష్

తుని నియోజవర్గం, గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన పార్టీ తుని మండల అధ్యక్షులు ధారకొండ రమణని పరామర్శించడానికి గురువారం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తుని నియోజకవర్గం వెళ్ళి, అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి అన్నివేళలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ధారకొండ రమణకి చెప్పి ఆయనలో నూతన ఉత్సాహం నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర జిల్లా సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, బోనం చినబాబు, లట్టాలా నాగేశ్వరావు, అద్దేపల్లి బాలాజీ, తేనే నాగశేషు, చోడిశెట్టి భాస్కర్, కర్రీ ప్రసన్న, గెడ్డమూరి సురేష్, వంగలపూడి వంశీ, గట్టెం నాగబాబు, రచపోతుల అశోక్, కంకిపాటి లోవరాజు, పమ్మి సాయి, బొప్పన రాంబాబు, నల్లాల దుర్గ ప్రసాద్ మరియు తుని జనసైనికులు పాల్గొన్నారు.