జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా పితాని

  • పితాని ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’
  • పితాని సమక్షంలో జనసేనలో చేరికలు

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో తాళ్లరేవు మండలం చింతాకుల వారి పాలెం మరియు ఉప్పంగల గ్రామంలో ఎస్సీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడున్న ఎస్సీ గ్రామ పెద్దలతో మాట్లాడి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి కార్యక్రమాలను వారికి వివరించడం జరిగింది. వారందరూ జనసేన పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని మాట ఇచ్చి స్వచ్ఛందంగా జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గుత్తాల బాలకృష్ణ ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో సుమారు 100 మందికి పైగా వైయస్సార్ పార్టీ టిడిపి పార్టీల నుండి జనసేనపార్టీలో చేరడం జరిగింది. వారికి ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్కావెంకట్రావు మడికి కాంతి కుమార్, తడాల చిన్నబాబు, దాడల శ్రీనివాసరావు, మడికి లోవరాజు, మడికి శేషారావు, మడికి బాలకృష్ణ, గుత్తాల లవకుమార్, పాము రాజు, కోరుకొండ భైరవమూర్తి, కోరుకొండ దుర్గారావు, కోరుకొండ సిద్ధార్థ, పాము హరి, మడికి వీరబ్రహ్మం సుమారు 100 పైగా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతను బాలకృష్ణ వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్ధ జమ్మి, ఉభయగోదావరి జిల్లాల మహిళా ప్రెసిడెంట్ ముత్యాల జయలక్ష్మి, ముత్యాల బోసు, పంపన సూరిబాబు, టేకుమూడి త్రిమూర్తులు, చింతాకుల ఈశ్వరరావు, పి జయరాజ్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.