చెరుకూరు వెళ్లే ప్రధాన రహదారిని మరమ్మతులు చేయండి

డీఈఈపీఐయూ మరియు ఏఈఈ పీఐయూకి వినతిపత్రం ఇచ్చిన పొన్నలూరు జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో పైరెడ్డిపాలెం గ్రామం నుండి చెరుకూరు గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది, ప్రస్తుతం ఈ ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా గుంతలగుంతలుగా మారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రయాణికులు ఈ రహదారిలో ప్రయాణించాలి అంటే ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేసి, యాక్సిడెంట్లు జరగకుండా చూసి, ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ డీ.ఈ.ఈ.పీ.ఐ.యూ సి. శ్రీధర్ రెడ్డి మరియు ఏఈఈ పీ.ఐ.యూ వి. మాలకొండయ్యకి పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ గురువారం సింగరాయకొండలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసుల శ్రీనివాసులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.