గణపతి లడ్డూని కైవసం చేసుకున్న మేడబోయిన కార్తీక్

ఖమ్మం నగరం ద్వారకా నగర్లో గల 53 వ డివిజన్ శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్ తన సతీమణి స్పందన పాల్గొని రూపాయలు 14016/- లడ్డు ని దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో లడ్డు కోసం ఆరుగురు స్థానికులు మరియు ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. చివరికి మేడబోయిన కార్తీక్ స్వామివారి మహా ప్రసాదం లడ్డూని దక్కించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని తన మనసులోని వాంఛను బలంగా కోరుకొని ఈ యొక్క మహా ప్రసాదాన్ని 53వ డివిజన్లో గల ప్రజలకు పంచి పెడతానని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో 53 వ డివిజన్ ప్రజలు మరియు శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని మేడబోయిన కార్తీక్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.