గల్ఫ్ జనసేన వీరమహిళల ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఆత్మీయ సమ్మేళనం

యుఏఈ, గల్ఫ్ జనసేన వీరమహిళల ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన ఆత్మీయ సమ్మేళనం, మైత్రి పామ్ అజమాన్ లో కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అందరిని కలుపుకుని వెళ్లాలనే సంకల్పంతో జాతీయ కన్వీనర్స్ కేసరి త్రిమూర్తులు, మొగళ్ళ చంద్రశేఖర్, కంచన శ్రీకాంత్(కువైట్), చందక రాందాస్ (ఒమాన్), ప్రాంతీయ కన్వీనర్స్ మరియు ఎక్సక్యూటివ్ టీమ్ మెంబెర్స్ వీరి అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సోషల్ మీడియా స్పోక్స్ పర్సన్ మరియు మేనేజ్మెంట్ ఇంచార్జ్ అజయ్ కుమార్, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్య మరియు వాటర్ మేన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.