ప్రభుత్వంపై మండిపడ్డ కటికం అంకారావు

*భీమ్లా నాయక్ స్పెషల్ షోలు ఆపటం కాదు.
*ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే, స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి
*జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కటికం అంకారావు.

గుంటూరు, టీచర్లను వైన్ షాపులు వద్ద కాపలా పెడతారు.
రెవెన్యూ వారిని థియేటర్లు వద్ద కాపలా పెడతారు. ప్రభుత్వమేమో చేపలు మటన్ అమ్ముతుందని చెప్తారు. ఆంధ్రావారికి ఏంటో ఈ ఖర్మ అని ఆయన ఏద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ శిఖరం లాంటోడని ఆయనను ప్రభుత్వం ఏమిచేయలేదని, ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ బీమ్లా నాయక్ సినిమా కోసం పనిచేస్తున్నాయని, ఆయన తెలియజేశారు. గతంలో ఏ సినిమాకి లేని ఆంక్షలు బీమ్లానాయక్ కు విధించడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. 2024లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన హితవు పలికారు.