నో మై కాన్స్టిట్యూఎన్సీ 54వ రోజు

  • శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాజెక్ట్ వీధిలో శ్రీమతి వినుత కోటా పర్యటన

శ్రీకాళహస్తి: నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాజెక్ట్ వీధిలో పర్యటించి, గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానమైన సమస్యలు పారిశుధ్యం, డ్రైనేజ్ కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం వంటి సమస్యలు తెలిపారు. సమస్యలు మునిసిపల్ కమీషనర్, జిల్లా కలెక్టర్ గారి గృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకి వినుత గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ కుమార్, వెంకటరమణ యాదవ్, నితీష్ కుమార్, గిరీష్, ఉదయ్, చందు చౌదరీ జనసైనికులు వెంకటేష్, చంద్ర శేఖర్ యదవ్ తదితరులు పాల్గొన్నారు.