శ్రీనివాసులును పరమర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి. సుండుపల్లి మండల పరిధిలో జి.రెడ్డివారిపల్లి గ్రామవాసులు, బలిజసంగం మండల ఉపాధ్యక్షుడు జయరామ్ కుమారుడు శ్రీనివాసులు ఇటీవల కాలంలో రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ సందర్భంలో కుడి కాలు గాయానికి గురవ్వగా విషయం తెలుసుకున్న రామ శ్రీనివాస్ వారి స్వగృహం నందు విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాసులును పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.