పెదంకలాంలో మన సీతానగరం – మన జనసేన కార్యక్రమం

రాజానగరం: పెదంకలాంలో “మన సీతానగరం – మన జనసేన కార్యక్రమం”లో భాగంగా జనసేన సిద్ధాంతాలను సీతానగరం మండలం పెదంకలాం పంచాయతిలో సీతానగరం జనసేన టీం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇంటికి జనసేన కరపత్రాలు పంచి పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్ని వివరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్డినేటర్ పైల సత్యన్నారాయణ, సీనియర్ నాయకులు అక్కివరపు మోహనరావు, అల్లు రమేష్, సత్యన్నారాయణ కాల్యంపూడి, జై శంకర్, సాయి కిరణ్, గణేష్, నాయుడు, సుధీర్ పాల్గొన్నారు. పైల సత్యన్నారాయణ మాట్లాడుతూ రాబోయేది జనసేన- టీడీపి ఉమ్మడి ప్రభుత్వమేనని, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో కార్మిక, కర్షక, బడుగు బలహీనర్గాలు విసిగిపోయి ఈ ప్రభుత్వాకి చరమ గీతం పాడాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.