జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కోడుమూరు జనసేన

  • ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి
  • రాయలసీమ తిరుపతిలో జనవాణి

కోడుమూరు, రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు 21వ తేదీన ఆదివారం రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని కోడుమూరు నియోజకవర్గ 4 మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఆకెపోగు రాంబాబు, రాజు, రహమతుల్లా, మోహన్ పిలుపునిచ్చారు, సామాన్యుడి గళం ప్రభుత్వానికి వినిపించేలా రాయలసీమ జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనవాణి కార్యక్రమంలో పాల్గొని నేరుగా జనసేన పార్టీ అధినేతకు ఇస్తే ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక యంత్రాన్గం కృషిచేస్తుందని ప్రజలు ఈ నెల 21 వతేది ఉదయం 10 గంటల లోపు తిరుపతిలో గల జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హల్ నందు హాజరై కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఈ జనవాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.