చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా మృత్యుంజయ హోమం నిర్వహించిన రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు, మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన వారోత్సవాలు భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక దత్తసాయి దేవాలయం నందు మృత్యుంజయ హోమం నిర్వహించి 108 శివ లింగాలకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ రక్తదానం నేత్రదానం అలాంటి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి దాత మెగాస్టార్ చిరంజీవి, కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితిలో ఆక్సిజన్ బ్యాంకు నిర్వహించి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన మహోన్నత వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో తమ అభిమాన నాయకుడు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తామని అలాగే మెగాస్టార్ నటించబోయే ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివ, చైతన్య, గోవర్ధన్, మనోజ్, రమేష్, దత్తు, ఉదయ్, మురళి, పవన్, తదితరులు పాల్గొన్నారు.