రైతు భరోసా యాత్రకు తరలివెళ్ళిన రైల్వే కోడూరు జనసేన

రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి జనసేన కౌలు రైతు భరోసా సభకు కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని గాదెల, ఎద్దుల వారి పల్లె ప్రాంతాల నుండి బాధితులను తీసుకొని గంధం శెట్టి దినకర బాబు ఆధ్వర్యంలో జనసైనికులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, శ్రీను, రెడ్డి మని, కిషోర్, మాదం సుబ్రహ్మణ్యం, నల్లంశెట్టి నరసింహ తదితరులు కౌలు రైతు భరోసా సభకు తరలి వెళ్లారు.