కోన సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన బాలరాజు

పోలవరం: గత 8రోజుల క్రితం కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామస్తుడు, జనసేన కార్యకర్త క్రియా శీలక సభ్యులు కోన సురేష్ విద్యుత్ ఘాతంతో మరణించడం జరిగింది. ఇందుకుగాను సోమవారం మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి తీరని లోటని, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున వారి కుటుంబానికి భరోసాగా ఐదు లక్షల రూపాయల బీమా అందజేస్తామని పార్టీ తమ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్, మల్ల బత్తుల రాము, రాజవరం గ్రామ అధ్యక్షులు అనంతల శ్రీను, కుమార్, సరిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఉరింకల సత్తిబాబు, మంచాల యేసు పలువురు నాయకులు పరామర్శించారు.