నక్కరాజు సతీష్ ని ఘనంగా సన్మానించిన కొత్తవలస జనసైనికులు

శృంగవరపుకోట: విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలో కొత్తవలస మండల జనసేన అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన సాధారణ మధ్య తరగతి కుటుంబంనకు చెందిన నక్కరాజు సతీష్ ని ఘనంగా సన్మానించిన కొత్తవలస మండల జనసైనికులు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతర పనిచేస్తానని, నిరుపేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని కులమత ప్రస్తావన లేని రాజకీయ సిద్ధాంతాలను కలిగిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్ని కులాలను ఐక్యత చేసి కమిటీలు వేసి బలోపేతానికి కృషి చేస్తామని పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతర పనిచేస్తానని, నిరుపేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని మీడియా ముఖంగా సతీష్ తెలిపారు. కొత్తవలస జనసేన క్రియాశీలక నాయకులు మాట్లాడుతూ.. మండల, నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి శృంగవవరపుకోట నియోజకవర్గ స్థానం జనసేన కైవసం చేసుకుంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల జనసేననాయకులు పెదిరెడ్ల రాజశేఖర్, పిల్లా రామదుర్గ, మల్లువలస శ్రీను, గాలి అప్పారావు, గురజాడ వెంకటేష్, రామదాసు,కాశి, షేక్ ఖాన్, పట్నాల రాజు, తోట శ్రీను, బొబ్బరి సురేష్, జామి బాలరాజు, లక్ష్మీ కాంత్, శ్యామ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.