కొత్తగేట్ దుర్గమ్మతల్లి దేవి నవరాత్రులలో బొలియశెట్టి దంపతులు

మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేట్ దుర్గమ్మతల్లి దేవి నవరాత్రుల సందర్భంగా గుడి ధర్మకర్త అఖిల నాయుడు (భవాని) ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ దంపతులతో పూజా కార్యక్రమాలు, దీపారాధన మరియు అన్నదాన కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండపల్లి, కొత్తగేట్, ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు, దుర్గమ్మ తల్లి భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.