వైసీపీ ప్రజాప్రతినిధులు బస్ యాత్ర చేసే నైతిక హక్కు కోల్పోయారు

  • జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

పాడేరు: గిరిజన జాతి ఆస్తిత్వంపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం, గిరిజన ప్రజాప్రతినిధులు బస్ యాత్ర చేసే నైతిక హక్కు కోల్పోయారని జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. ఆదివారం గంగులయ్య విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన జాతికి ఏమి చేసారని బస్ యాత్ర చేస్తారో ప్రజలకు తెలియజేయాలి. బహుశా బీసీ ఉపకులాలైన బోయవాల్మీకులను, బెంథోరియలను ఎస్టీ జాబితాలో చేర్చి అసలైన గిరిజన జాతి అస్తిత్వానికి అత్యాచారం చేశామని అందుకు విజయసూచికగా బస్ యాత్ర చేస్తున్నారా? గిరిజన నిరుద్యోగుల కల్పతరువు జీవో నెం3 ని రివ్యూ పిటిషన్ వేసి రక్షించినందుకు విజయ దరహాసంతో బస్ యాత్ర చేస్తున్నారా? గిరిజన హక్కులు, చట్టాలు నిర్వీర్యమై పోతున్న పట్టించుకోకుండా ప్రభుత్వాలకు ప్రశ్నించకుండా కట్టుబానిసత్వం ప్రకటించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని స్వేచ్ఛను తాకట్టు పెట్టినందుకు బస్ యాత్ర చేస్తారా?. గిరిజన ప్రాంతాల్లో అంతకంతకూ పెరుగుతున్న మాత శిశు మరణాలు అరికట్టి ప్రజారోగ్యవ్యవస్తను సక్రమంగా అమలు చేసినందుకుగాను బస్ యాత్ర చేస్తారా? గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థి, విద్యార్థినులు మరణాలు పెరుగుతుంటే ప్రజాప్రతినిధులు సంతోష సంబరాలతో బస్ యాత్ర చేస్తున్నారా?. విద్యార్థులకు పసి ప్రాయంలోనే ఉపకులాల సిచ్చు అంటే ఏమిటో నేర్పించాలని చైల్డ్ ఇన్ఫో లో ఉపకులాల సిచ్చు పెట్టి రాక్షసనందం పొందినందుకుగాను బస్ యాత్ర చేస్తున్నారా?. గిరిజన అస్తిత్వమంటే మొట్టమొదటి సాంస్కృతిక పట్టుగొమ్మ ఒకొక్క తెగకు ఒక ప్రత్యేక భాష అటువంటి భాష బావి తరాలకు వరసత్వంగా ఇవ్వాలి కానీ మీరు వచ్చి ఈ భాష ఉపాధ్యాయులను తొలగించి భవిష్యత్ లో గిరిజన అస్తిత్వమంటే ఉండకూడదనే వెకిలి వికట్టహాసంతో ఈ బస్ యాత్ర చేస్తున్నారా?. గిరిజన ప్రజలు ప్రకృతి ఆరాధకులు వాళ్ళ సహజ సంపద దోపిడీ చెయ్యడానికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, అక్రమ మైనింగ్ కి రకరకాల కడప కంపెనీలకు కట్టబెట్టి తాయిలాలు పుచ్చుకున్నందుకు గుర్తుగా బస్ యాత్ర చేస్తున్నారా?. గత ప్రభుత్వాల నుంచి గిరిజన ప్రజలకు వచ్చే 27 పథకాలు రద్దు చేసి వారి ఎదుగుదలను అడ్డుకున్నామనే సంతోషంతో బస్ యాత్ర చేస్తున్నారా? గ్రామస్థాయి మౌళిఖ సదుపాయాల కల్పనకోసం వెచ్చించే పంచాయితి(ఎస్టీ సబ్ ప్లాన్)నిధులు పక్కదారి మళ్లించి బొక్కినందుకు గాను బస్ యాత్ర?. ఉత్తమ విద్యాప్రతిభగల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ రద్దు చేసి వారి ఎదుగుదలను అడ్డుకున్నందుకు ఆనందంగా బస్ యాత్ర చేస్తున్నారా?. సంవత్సరానికి ఒక డిఎస్సి తీసి నిరుద్యోగులను అదుకున్నందుకు గాను బస్ యాత్ర చేస్తున్నారా?.
గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డిఎస్సి నిర్వహించి అదుకున్నందుకా బస్ యాత్ర? జోనల్ విధానంలో గిరిజన నిరుద్యోగుల అవకాశాలను డెబవతీసినందుకు సంతోషం పట్టలేక బస్ యాత్ర?
గిరిజనులు నిజంగానే తమ ఉనికి, అస్తిత్వం, అభివృద్ధి వంటి విషయాలపై తార్కిక ఆలోచన చేస్తే, ఆ చైతన్యం వారిలో నిజంగానే కలిగితే మీరు నిర్వహించే బస్ యాత్రకి ఒక్క గిరిజనుడు కూడా హాజరు కారు? కాలేరు?. గిరిజన ప్రజలారా యావత్ జాతినుద్దేశించి చెప్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వం మన జాతిపై మన ఆస్తిత్వంపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన మాట వాస్తవం. మనల్ని నిలువునా ముంచి మోసం చేసిన మాట జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా మేలుకో ఇకనైనా జాతి జాగృతికోసం ఆలోచించు. ఈ రాక్షసపాలన గిరిజనులపై చేసే అంతర్గత యుద్దాలపై నీకు నువ్వుగా చైతన్యవంతుడు కావాలి. నీ జాతిక్షేమం కోసం నువ్వే పోరాడాలి. జాతి ద్రోహుల్ని నమ్మి మీ అస్తిత్వాన్ని అత్యాచారం చేసే రాక్షస మూకల చేతులకు మీ రక్షణ బాధ్యత అప్పగించొద్దు. మీకు మీరే కాపాడుకోవాలి. మేలుకోండి గిరిజనులారా భవిష్యత్ కోసం ఆలోచన చెయ్యండి. గిరిజన సోదరి, సోదరులారా సమర్ధవంతమైన నాయకత్వం ఎన్నుకోవడంలో గిరిజన సమూహాలు చేసిన పొరపాటు కారణంగా ఈ ప్రపంచంలో కనుమరుగైన గిరిజన జాతులెన్నో అంతరించిపోయాయని గిరిజన ప్రజలకు ఈ సందర్బంగా పిలుపునిస్తున్నామని గంగులయ్య పేర్కొన్నారు.