మాండోస్ తుఫాను వలన నష్టపోయిన పంటలను పరిశీలించిన లంకా నరసింహారావు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం బెస్తవారపేట మండలం కలగొట్ల గ్రామం లో జనసేన ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు మాండోస్ తుఫాను వలన నష్టపోయిన పంటలను పరిశీలించిన జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు గ్రామం లో రైతులను కలిసి పంటనష్టం గురించి తెలుసు కొనడమైనది, కలగొట్ల గ్రామంలో శనగ, పత్తి, మిర్చి పంట పూర్తిగా నష్టం జరిగినది అని రైతులు చెప్పడం జరిగినది. పంట నష్టం క్రింద ప్రభుత్వం ఎకరాకు 20 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని జనసన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్, బెస్తవారపేట మండల నాయకులు మధుసుధన్ రెడ్డీ, ఇల్లురి అనిల్ జనసేన నాయకులు ఆదినారాయణ, నరేంద్ర మరియు రైతులు పాల్గొన్నారు.