మదనపల్లిలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

మదనపల్లి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్న నరసాపురం సభలో మత్స్యకారులకు అండగా నిలబడి అదే విధంగా ప్రభుత్వం ఏదైతే 217 జారీ చేసిన జీవోను బహిరంగ సభలోనే చించివేస్తూ మత్స్యకారులకు అండగా ఉంటానని తెలియజేయడం అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ… సోమవారం అధ్యక్షులవారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని క్రియాశీలక మెంబర్షిప్ లాంచ్ చేయడం జరిగింది. దీనిని క్రియాశీలకంగా పార్టీకి పని చేస్తున్న ప్రతీ కార్యకర్త సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానని జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.