ఘంటసాల వెంకటలక్ష్మిని పరామర్శించిన పోలవరం జనసేన నాయకులు

దెందులూరు, గత కొద్దీ రోజుల క్రితం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి భర్త మరణించడం జరిగింది. ఇందుకు గాను వారి కుటుంబాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, టీ. నరసాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు, పూనెం ఆదిత్య, మల్లవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.