పితాని అధ్యక్షతన జనసేన ముఖ్య నాయకుల సమావేశం

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ నందు బుధవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు పిఎసి సభ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన నాలుగు మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 16-10-2023 నుండి ఇంటింటా జనసేన అనే కార్యక్రమమునకు నాంది పలకనున్నారు. ఈ కార్యాచరణ నిమిత్తం 14వ తారీఖున చర్చించుకునే నిమిత్తం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుకు నిర్ణయించినారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.