బాసరలో దేవాన్ష్, ఆర్యవీర్ లకు అక్షరాభ్యాసం..

తెలంగాణలో సరస్వతీ దేవి  కొలువైన పుణ్యక్షేత్రం బాసరలో నారా చంద్రబాబునాయుడు, నందమూరి హరికృష్ణ కుటుంబాలు ఈ ఉదయం సందడి చేశాయి. ఇరు కుటుంబాల వంశాంకురాలు దేవాన్ష్, ఆర్యవీర్ ల అక్షరాభ్యాసం ఈ ఉదయం బాసరలో వైభవంగా జరిగింది. ఒకవైపు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ, విశాఖపట్నం ఉక్కు విషయంలో పోరాటానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు, ఈ ఉదయం తమ అన్ని పనులనూ పక్కనబెట్టి, బాసరకు వచ్చారు.

ఇక పండితుల సమక్షంలో పిల్లలకు బ్రాహ్మణి, వసుంధరలు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కూడా పాల్గొన్నారు. బాలయ్య కుమారుడు మోక్షిత్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపించాడు. ఇక తమ అభిమాన నటుడి ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకున్న నందమూరి అభిమానులు ఆలయానికి పోటెత్తారు. మోక్షిత్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. స్థానిక పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.