జనసేన అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుగా ఎన్నికైన మాదాల శ్రీరాములు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ భలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ భలోపేతం చేయుటలో భాగంగా.. నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ సభ్యులను డా” వంపురు గంగులయ్య గారి అద్వర్యం లో కమిటీ నియమించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా.. జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుగా మాదాల శ్రీరాములును ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ లో చోటు దక్కినందుకు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పీఏసీ సభ్యులు నాగేంద్ర బాబు గారికి, అరకు పార్లమెంట్ ఇంచార్జి డా. వంపురు గంగులయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. అదే రీతిగా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ భావజాలం ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్లుటకు పవన్ కళ్యాణ్ గారి పోరాట స్పూర్తితో నిత్యం ప్రజల్లో ఉంటూ కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగుల సంఘాలకు, మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా గ్రామ స్థాయిలో తీసుకెళ్తూ పార్టీ బలోపేతం చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చూడలన్నదే నా కర్తవ్యం అని మాదాల శ్రీరాములు తెలియ జేశారు.