వీరవిల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ దంపతులు

మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, వీరవిల్లి అగ్రహారం గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ వారి సతీమణి శ్రీమతి గుమ్మడి రేవతి లు ఇద్దరు లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ… ఆధ్యాత్మిక చింతన ద్వారా మనిషిలో ఉన్న రాగద్వేషాలు పోయి మనస్సు ఎంతో ప్రశాంతతో సంపూర్ణంగా హాయిగా దైవానుగ్రహంతో సుఖ సంతోషాలు పొంది దైవం మానుష్య రూపేన అని మన పెద్దలు చెప్పినట్లు నలుగురికి సేవ చేసే గుణం కూడా అలవడుతుంది అని అన్నారు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి గుమ్మడి రేవతి గారు మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో ఉన్న నా తోటి ఆడపడుచులు అక్క చెల్లెమ్మలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అంతేకాకుండా 2024 లో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని చాలా బలంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని కోరుకున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.