పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి

*ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సూరాయిపాళెం పవన్ కుమార్

సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలోని ఉన్నత పాఠశాలను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సూరాయిపాళెం పవన్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. వారంతరపు మెను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని విద్యార్థులనుంచి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన తీసుకోకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆహర నాణ్యత స్టోర్ రూములో సరుకులు, కూరగాయలు, గుడ్లు నాణ్యత పరిశీలించారు. తానే స్వయంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న బోజనాన్ని రుచించారు. అనంతరం ఉపాద్యాయులకు విద్యార్థుల పట్ల పలు సూచనలు సలహాలు తెలియజేసారు.