పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై మహాధర్నా- ధర్నాలో పాల్గొన్న వరుపుల తమ్మయ్య

ప్రత్తిపాడు నియోజకవర్గం: రాష్ట్రంలో గ్రామ పంచాయితీ నిధులు గురించి, కేంద్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి గురించి పంపించిన నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై కాకినాడ జిల్లా జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో గురువారం మహా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు హాజరవ్వడం జరిగింది. వీరితోపాటు జనసేన, బీజేపీ జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.