జూన్ 1వ తేదీన పోలవరం జనసేన ఆధ్వర్యంలో మహాధర్నా

  • పోలవరం సత్యసాయి వాటర్‌ ప్లాంట్‌ పునఃప్రారంభించాలని జనసేన డిమాండ్‌

పోలవరం, గత ఏడాదినుండి పోలవరంలో గల సత్యసాయి గోదావరి మంచినీటి పథకం నుండి సరఫరా అయ్యే మంచినీటిని ఆపేసారు గతంలో కూడా నీటిని అందించాలని జనసేన నుండి పోరాటాలు చేయడం జరిగింది. అధికారులు నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు జనంలో జనబాట కార్యక్రమంతో జనం మద్యలోకి మనం తిరుగుతుంటే జనానికి అవసరమయిన గోదావరి నీరు రాక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో అర్ధమైంది. జనసేన అంటే ప్రజల గొంతుక కనుక సత్యసాయి గోదావరి మంచినీటి పథకం పునరుధ్ధరణ చేయాలని జూన్‌ నెల 1 తేదీన అంటే బుధవారం పోలవరం నడిబొడ్డున జనసేనపార్టీ చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో బారీగా మహాధర్నా నిర్వహించ తలపెట్టడం జరిగింది. అన్ని మండల అద్యక్షులు, నాయకులు తమ తమ గ్రామాల్లో కార్యకర్తల్ని సంసిద్దం చేయాలని ఎన్ని పనులున్నా 1 తేదీ మద్యాహ్నం 2 గంటలకి కి పోలవరం చేరుకునేలా సిద్దం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మరియు ముఖ్య నాయకులు పాల్గొననున్నారని తెలిపారు.