ప్రజా సమస్యలు తీర్చడానికి జనసేన ముందుంటుందని మరోసారి నిరూపించిన వంపురు గంగులయ్య

పాడేరు, సోమవారం జి.మాడుగుల మండలం బోయితిలీ పంచాయతీ సురిమెట్ట గ్రామంలో ప్రధాన రహదారి వాహనాల రాకపోకలకు అంతరాయంగా ఉండడంతో జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ వంపురు గంగులయ్య ఆర్థిక సహాయంతో రోడ్డుకి ఇరువైపుల ఉన్న మట్టిని జె.సి.బి తో తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జి.మాడుగుల జనసేన పార్టీ మండల అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఎన్నోసార్లు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు తెలిపిన ఎవరూ స్పందించలేదని సూరి మెట్ట గ్రామస్తులు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడంతో జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇంచార్జి డాక్టర్ వంపురు గంగులయ్య ఆ గ్రామాల ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని తన సొంత ఖర్చుతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం జనసేన పార్టీ తరఫున చేయటం చాలా సంతోషకరం అని ఆయన చెప్పారు. సూరి మెట్ట గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారని ఆయన అన్నారు.