మహంకాళమ్మ చల్లగా చూడాలి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా భక్తులందరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలను తల్లి మహంకాళమ్మ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.