నార్పల జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజి జయంతి వేడుకలు

నార్పల: జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సంధర్భంగా మండల కేంద్రం లోని గాంధీ సర్కిల్ నందు గల విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో నార్పల జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ మండల గౌరవ అధ్యక్షుడు తుపాకుల భాస్కర లు మరియు జనసైనికులు లోకేష్, మహేష్,శివ రాయల్, నరసింహ, సూరి, ప్రతాప్ రెడ్డి లు పాల్గొని ఘన నివాళులర్పిచడం జరిగింది.