బిల్లుమడ జనసేన కార్యాలయంలో మహాత్ముని జయంతి వేడుకలు

మన్యం జిల్లా, భామిని మండలం, బిల్లుమడ గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మన దేశ మహాత్ముడు, జాతిపిత స్వతంత్ర సమరయోధులు శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా బిల్లుమడ గ్రామంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి జయంతి జరుపుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా దాసరి మహేష్ మాట్లాడుతూ “గాంధీజీ గారు దేశ అభివృద్ధి అంటే మొదటగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పడం జరిగింది.. దేశ స్వతంత్ర్యం నుంచి ఇప్పటివరకు కూడా కుటుంబ రాజకీయాల వలన దేశంలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చెందలేదని, చీకటి మాయలో నింపారని. జనసేన పార్టీ ప్రభుత్వానికి వస్తేనే గ్రామంలో అభివృద్ధి కి జరుగుతుంది” అని తెలియజేయడం జరిగింది.. ఈ కుటుంబ వ్యవస్థ రాజకీయాలకు స్వస్తి పలికి.. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు గెలిపించుకునేలా బాధ్యత వహిస్తాం అని కూడా తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్, వైకుంఠరావు మరియు నాగేష్, శివ, కోటేశ్వరరావు, రాజు, సుబ్రహ్మణ్యం, జనసైనికులు పాల్గొన్నటం జరిగింది.