పుట్టపర్తి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం, పుట్టపర్తిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా గాంధీ ఆశయాలను మరియు ఆయన దేశం కోసం చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, జిల్లా కార్యదర్శి మరియు పుట్టపర్తి పట్టణ అధ్యక్షులు బొగ్గరం శ్రీనివాసులు, డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, బోయ వంశీ, మేకల పవన్, మాండ్లి ఆదిశేషు, చిగిచేర్ల గణేష్, తిరుపతి ప్రకాష్, విజయ్ సాయి, పాపిరెడ్డిపల్లి విజయ్, సాయి ప్రభ తదితరులు పాల్గొన్నారు.