అభిమానులకు లేఖ రాసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన అంటే ఆయన అభిమానులకు పిచ్చి ప్రేమ. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని, ఆయన అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మహేష్ పుట్టినరోజు నాడు, అభిమానుల

సంబరాలతో పాటు వారి సేవా కార్యక్రమాలకు హద్దులు ఉండవు. అయితే ఈ ఆగస్టు 9న, మ‌హేష్  45వ వ‌సంతంలోకి అడుగు పెడుతుండడంతో,  సామూహిక వేడుక‌లి దూరంగా ఉంటూ ఇంట్లో క్షేమంగా ఉండాల‌ని మహేష్ తన అభిమానులను కోరారు. ఈ మేరకు ఓ లేఖను ట్విట్టర్లో విడుదల చేశారు.

ప్రియ‌మైన అభిమానులకు….మీరంద‌రు నాకు తోడుగా ఉండ‌డం నా అదృష్టం. నా పుట్టిన రోజు ప్ర‌త్యేక‌మైన రోజుగా గుర్తుండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కి చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అంద‌రిని అభినందిస్తున్నాను. ప్ర‌స్తుతం క‌రోనాతో మ‌నమంద‌రం చేస్తున్న ఈ యుద్ధంలో సుర‌క్షితంగా ఉండ‌డం అనేది అన్నిటికంటే ముఖ్యం. అందుకని నా పుట్టిన రోజున అభిమానులంద‌రు సామూహిక వేడుక‌లకి దూరంగా ఉంటూ ఇంటివద్దె ఉండాల‌ని కోరుకుంటున్నాను అంటూ మ‌హేష్‌ ట్వీట్ చేశారు. అదలా ఉంటే మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనుంది. అయితే ఇప్పుడు అ గిఫ్ట్‌ ఎంటో అనే  దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే, ‘సర్కారు వారి పాట’ టైటిల్ ట్రాక్‌ను చిత్రబృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ పాటకు మహేష్ వాయిస్ తో కూడిన ఒక మెసేజ్ ను జత చేయనున్నట్టు తెలుస్తోంది.