గుంటూరు జిల్లా మహిళా సదస్సును జయప్రదం చేయండి: పార్వతి నాయుడు

జనసేన పార్టీ మహిళా వింగ్ కో ఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా మహిళా సదస్సు మే 20 వ తారీఖున అనగా శుక్రవారం జరుగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా.. జొన్నలగడ్డ గ్రామ మహిళలందరూ మీటింగుకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా పార్వతి నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో బి.మల్లికా, పి.వరలక్ష్మి మరియు వీర మహిళలు పాల్గొన్నారు.