యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ముత్తా శశిధర్

రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న అనేక రకాలుగా నష్టపోయిన యువతకు భరోసాని ఇవ్వడానికే జనవరి 12వ తేదీన యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సామాన్య యువతీ యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారని యువశక్తిలో మీ గళం వినిపించాలని, యువత అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యువత యొక్క సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున యువత ప్రతి ఒక్కరూ ఈ యువశక్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ తో పాటు రాష్ట్ర సెక్రటరీ వాసిరెడ్డి శివప్రసాద్ మరియు రాజాం నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.