పలు కుటుంబాలకు ఆర్ధికసాయమందించిన రాజానగరం జనసేన నాయకులు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన యాళ్ళ ధర్మారావు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అని తెలిసి వారిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి రాజానగరం మండలం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర సూర్యారావుపేట జనసేన పార్టీ ఎంపిటిసి రమణ (డబ్బు) రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు పరామర్శించి జనసేన పార్టీ తరఫున 5,000₹ రూపాయలు ఆర్ధికసాయం చేయడం జరిగింది. అనతరం ఎగ్గాడ జాన్ ఎడమకాలు సెప్టిక్ అవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని వారికి 5,000₹ రూపాయలు ఆర్ధికసాయం చేయడం జరిగింది. అనంతరం రాయి బేరజ్జి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అని తెలుసుకుని వారిని వారిని పరామర్శించి జనసేన పార్టీ తరఫున 5,000₹ రూపాయలు ఆర్ధికసాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబాలకు అన్ని విధాల ధర్మారావు కుటుంబంనికి అండగా ఉంటామని జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, రాజానగరం మండల కమిటీ కార్యదర్శి నల్లమిల్లి విష్ణుచక్రం, జనసేన పార్టీ యూత్ ఐకాన్ పల్లా హేమంత్ 12 వ వార్డ్ మెంబెర్ సురేష్, అడబాల హరి, నున్నా రాజా తదితర జనసైనికులు పాల్గొన్నారు.