గొల్లప్రోలులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాకినీడి శేషుకుమారి

గొల్లప్రోలు పట్టణంలలోని స్ధానిక పాపయ్య చావిడి వీధిలో సోమవారం జనసేన పార్టీ ఇంచార్జీ మాకినీడి శేషు కుమారి చేతులు మీదుగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీ ప్రజలలో భారీ ఆదరణ పొందుతుంని, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతున్న తమ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీ పిలుపు అందుకుని ప్రజా సమస్యల పోరాటం కోసం తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచి ధరలు భారీగా పెరిగాయని ప్రజల కనీస అవసరాల కన్నా పార్టీ నేతల ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే కార్యకర్తలంతా ఎప్పుడు అందుబాటులో ఉండి సేవాకార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ నాయకులు కీర్తి, చంటి, అమరాది రామకృష్ణ, పిఠాపురం రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, పట్టా శివ, వినుకొండ అమ్మాజీ, వి.శిరీష,సిహెచ్.శిరీష, నవీన్, అరిపి సోదరులు, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.