చంద్రగిరి రైతాంగానికి అండగా దేవర మనోహర

*ఎన్.హెచ్.ఏ.ఐ ఇంజనీర్లు మరియు అధికార యంత్రాంగ లోపం కారణంగా ఇబ్బంది పడుతున్న చంద్రగిరి రైతాంగం, అండగా నిలిచిన జనసేన పార్టి నాయకులు దేవర మనోహర

స్థానిక చంద్రగిరి నియోజకవర్గ, చంద్రగిరి మండలంలో హైవే రోడ్డుకి ఆనుకొని ఉన్న వ్యసాయ భూములలో వర్షపు నీరు చేరడంతో రైతు కంట నీరు మాత్రమే మిగులుతుందని అక్కడి రైతులు జనసేన పార్టీ నాయకులు దేవర మనోహర కి తెలిపి ఆవేదనకు గురయ్యారు.

ఎన్.హెచ్. ఏ.ఐ రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు వుధృతి వలన రోడ్డు దెబ్బతినకుండా ఉండాలని ఎనహెచఐ చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంజనీర్ల తీరుతో రైతులకు ఇబ్బందులు.

రైతుల బాగు విస్మరించి వర్షాకాలంలో ఎన్నో సంవత్సరాలుగా పారుతున్న చిన్న పెద్ద వాగులను మరచి రోడ్డు పనులు సర్వే నిర్వహించనందున చుట్టు పక్కల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చంద్రగిరి సర్వే నెంబరు 318 నందు వున్న 135 అడుగుల విస్తీర్ణం గల వాగును కుడి నుండి ఎడమ వైపునకు మళ్లించిన ఎస్.హెచ్.ఎ.ఐ అధికారులు కారణమే కాకుండా సుమారు 6 నుండి 7 ఎకరాల భూములు అన్యాక్రాంతం కావడంతో రైతులు వేదనకు గురవుతున్నారు. సదరు సర్వే నెంబరులోని వాగును చుట్టు ప్రక్కల రైతులు ఆక్రమించుకొని అక్కడ భూమిని ఎత్తు చేయడం వలన సర్వ్ నెంబర్ 331, 327, 328 నందు గల భూములు ముంపునకు గురవుతున్నాయి.

కొత్తగా వేసిన రియల్ఎస్టేట్ నుండి సర్వే నెంబర్ 318, 324 నందలి వాగుకి వర్షపు చేరలేక క్రాస్ డ్రైన్ వలన విక్రమ్ పెట్రోల్ బంక్, పాత స్సన్ పైప్స్ స్థలము వద్ద రోడ్డుకి అనుకొని వున్న వాగు స్థలం పూర్తిగా ఎన్.హెచ్.ఎ.ఐ వారు వేసిన రోడ్డు వలన వర్షాకాలంలో పెద్దఎత్తున నీరు చుట్టు ప్రక్కల పట్టా భూముల్లో నిలిచి పోవడంతో పంట
చేతికి రాక నష్టం వాటిల్లుతుంది. ఎన్.హెచ్ఎ.ఐ.ఒ వారి ముందస్తు నీరువర్షపు నీటికి కూలిన ప్రహరీ గోడ ప్రణాళికలు లేని కారణంగా వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా బీభత్స వాతావరణం తలపిస్తున్నది, ఎన్.హెచ్.ఎ.ఐ వారు విక్రమ్ పెట్రోల్ బంక్, మల్లయ్యపల్లి మలుపు వద్ద సుమారు రూ.కోటి తో నిర్మించిన కల్వర్టు నిరుపయోగం ఉండటమే కాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులుకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ భూమిని ఓ బడా వ్యక్తి ఆక్రమించుకోవడం విచారకరం.

అక్కడి సర్వే నం. 318, 324 లోని సుమారు 7 ఎకరాలు వెంచర్లుకు తోడు ఎస్ హెచ్ ఎ ఐ వారి నిర్వాకంతో కిలారి గార్డెన్స్ వెంచర్ తూర్పున గల ప్రహరీ కూలిపోవడంతో ఆ ప్రహరీ గోడక తూర్పున ఉన్న రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.

రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి జనసేన పార్టి అండగా ఉంటుందని ఆ పార్టీ నియజకవర్గ నాయకులు, జిల్లా కార్యదర్శి దేవర మనోహర తెలిపి దీనిపై సమగ్ర విచారణ జరిపి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రైస్తులకు న్యాయం చేయాలని స్థానిక ఇరిగేషన్ ఈ.ఈ కి బాధిత రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.