అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్షకు మద్దతుగా మన్యం జనసైనికులు

జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా.
అరకు నియోజకవర్గం, డిసెంబర్ 12న విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో దీక్ష చేపడుతున్న నేపథ్యంలో సంఘీభావ దీక్షకు మద్దతుగా విశాఖ మన్యం జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జనసేన పార్టీ ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో, ఆంధ్రుల కోసం ముందుకొచ్చినటువంటి మన గౌరవ ప్రియతమ నాయకుడు, మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాలని అధినేత చేస్తున్నటువంటి సంఘీభావ దీక్షకు ప్రతి ఒక్క జన సైనికులు కదలిరావాలని, మన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అధినేత పోరాటాల్లో అందరం భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా సాయిబాబ పార్టీ జన సైనికులకు పిలుపునిచ్చారు.