తాడేపల్లి గూడెం: జనసేనలోకి భారీ చేరికలు

తాడేపల్లి గూడెం, పెంటపాడు జనసేన మండల అధ్యక్షులు పుల్లా బాబి ఆధ్వర్యంలో సీనియర్‌ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నుండి బుద్దన శ్రీరాములు(బాబులు) దంపతులు వారి అనుచర వర్గంతో సుమారు 100 మందితో బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, తాడేపల్లిగూడెం రూరల్ అధ్యక్షుడు అడపా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, బుద్దన నారాయణ, తమటపు రాము, దాసరి శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.