శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

తెలంగాణ, జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బూత్ స్థాయి పర్యవేక్షణ మరియు విధి విధానాలు అంశాలపై చర్చించి అందరికీ అవగాహన కల్పించటం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ అద్యక్షులు మరియు వీర మహిళలు జనసైనికులు పాల్గొనటం జరిగింది.