జనసేన-టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశం

కాకినాడ: రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోఫై భవిష్యత్తు కార్యాచరణఫై కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉబయ పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం కాకినాడ కృషి భవన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేసంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణఫై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాటికాయల వీరబాబు, బోగిరెడ్డి గంగాధర్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, గంజా దుర్గా ప్రసాద్, కరెడ్ల గోవింద్, నూకల నారాయణ రావు, బండారు మురళి మరియు తెలుగుదేశం నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, పెంకే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసు దాసు, నూరుకుర్తి వెంకటేశ్వర రావు, రాందేవు సీతయ్య దొర, దేవు వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు.