నందలూరు మండల జనసేన ఆధ్వర్యంలో సమావేశం

రాజంపేట నియోజకవర్గం, గురువారం నందలూరు మండల జనసేన ఆధ్వర్యంలో చిన్న సమావేశం జరిగింది. భారతదేశంలో ఉన్న ఏ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేయని కార్యక్రమం మన అధినేత పవణ్ కళ్యాణ్ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తన దేయమని పేదప్రజల అభివృద్ధే తన లక్ష్యం అని క్రియా శీలక సభ్యత్వం ప్రవేశ పెట్టారు కేవలం 500 రూపాయలుతో ఈ సభ్యత్వం తీసుకొంటే మనకు అనుకోని ప్రమాదవశాత్తు గాయాలు అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చులకు 50,000 వరకు జనసేన పార్టీ భీమా, అలానే ప్రమాదంలో చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ 5,00000 వరకు మన కుటుంబ పోషణ కొరకు జనసేన పార్టీ ఇస్తుంది మన మేలుకోరి ఇటువంటి ఆలోచన చేసిన అధినేత మాటకు కట్టుబడి మనం కూడా ఈ క్రియా శీలక సభ్యత్వం తీసుకుందాం అని అలాగే పార్టీ ముందు నుంచి కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకి చెపుదామని ఈ గొప్ప కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని, పది మందికి మన చుట్టు పక్కల వారికీ చెపుదామని మండలంలో పార్టీ అభివృద్ధికి కృషిచేయడానికి అలాగే వేరు వేరు అంశాల మీద అంతర్గతంగా చర్చించడం జరిగింది.